బుచ్చయ్య పేట జయ జయహే
బుచ్చయ్యపేట మండలంలో గల భవత కేంద్రంను శనివారం జిల్లా సాహిత్య విద్య సమన్వయకర్త రామకృష్ణ సందర్శించారు. అక్కడ ఉన్న పిల్లలతో మమేకమై వారి యొక్క విద్యా స్థాయిలను తెలుసుకొన్నారు .రికార్డ్స్ , రిజిస్ట్రీస్ ను పరిశీలించి గృహ ఆధార విద్యను అందుకుంటున్నటువంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఇంటి వద్దకు కూడా సందర్శించి వారి తల్లిదండ్రులతో పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటూ వారికి సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బుచ్చయ్య పేట మండల భావత కేంద్రంలో గల సహిత ఉపాధ్యాయులు పోలిరాజు, దేముడునాయుడు పాల్గొన్నారు.
