శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు తయారుచేసిన గో కార్డ్ వాహనాల తయారీ సాంకేతిక నైపుణ్యాలను పరిశీలించేందుకు జాతీయస్థాయి సీజన్ 3 పోటీలలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభను యాజమాన్యం కొనియాడ దగిన విషయమని కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను యాజమాన్యం పెద్దలు అభినందించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐఐటి హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ బి వెంకటేశం హాజరయ్యారు, ఈ కార్యక్రమానికి ఆదిత్య విద్యాసంస్థల సొసైటీ చైర్మన్ డాక్టర్ కే సోమేశ్వరరావు అధ్యక్షతన జరిగింది, సొసైటీ కార్యదర్శి ఎల్ ఎల్ నాయుడు, కోశాధికారి టీ నాగరాజు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ డి శ్రీరాములు పర్యవేక్షకులుగా వ్యవహరించారు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
