విశాఖపట్నం జయ జయహే సీతంపేటలో శ్రీకృష్ణ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో సమావేశం మందిరము మరియు అతిథి గృహ భవనమును దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి తో పాటు వార్డు అభివృద్ధి లో కీలక పాత్ర పోషించాలని తెలియజేశారు. ప్రజలకు అవసరాలు అనుగుణంగా సంఘం చేస్తున్న కార్యక్రమాలు పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన శ్రీకృష్ణ యువజన సేవా సంఘం కమిటీని అభినందించారు . కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ తో పాటు కమిటీ అధ్యక్షులు బోరా ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గంగరాజు కమిటీ పెద్దలు వెంకటరమణ , వెంకట యాదవ్ ,గోవింద్ , ఆవాల వెంకట , గోవింద్ , సారిపల్లి సంతోష్ రాజారావు , నూకరాజు ,రామ కుమార్ ,సంతోష్ గారు, గొంప అప్పారావు , శ్రీనివాసరావు , పాపారావు , శ్రీనివాసరావు , అప్పారావు , వీర్రాజు రావు కొండబాబు సానబోయిన సురేష్ పాల్గొన్నారు..
