చోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు పాల్గొని ప్రజల నుంచి సమస్యల స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికే ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. చోడవరం పట్టణ పరిధిలో గల అనేకమంది కార్యాలయం చేరుకొని ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు.
