ప్రజల భాగస్వామ్యంతో గ్రామపంచాయతీ లో ఉత్తమ
సేవలందించిన ఇచ్చాపురం మండలం బొడ్డ పడ పంచాయితీ కార్యదర్శి కిల్లి మీనాక్షి కు జిల్లా పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ ఐ ఏ ఎస్ అధికారి ఆమెకు ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. బొడ్డపడ పంచాయితీలో శత శాతం ఇంటి పన్నులు, అధికారులు ఆదేశించిన బాధ్యతలను ఉత్తమ పనితీరు తో ప్రజా మన్నన లను పొందిన మీనాక్షి కి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సమీక్ష సమావేశంలో ఉన్నత అధికారులు ద్వారా ఉత్తమ కార్యదర్శి ప్రశంసా పత్రం పొందడం హర్షణీయమని తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు, భవిష్యత్తులో ప్రజాభిమానం, అధికారుల ఆశీస్సులతో మరిన్ని ఉత్తమ సేవలు అందించాలని పలువురు అభినందించారు.
ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా మీనాక్షి
RELATED ARTICLES
