రూ.9వేలురూపాయలు ఉండే సొమ్ము స్వాధీనం
గోకవరం మండలం కొత్తపల్లి గ్రామం మెయిన్ రోడ్ లోని గోకవరం వెళ్ళు మలుపులోని సాయిబాబా గుడిలో ది. వి. 03-02-2026 తేదీ అర్ధరాత్రి ప్రాంతంలో గుడి హుండీని బద్దల కొట్టి అందులోని సొమ్మును కొల్లగొట్టినట్టు గుడి కమిటీ మెంబర్ బడిగంటి సూర్య ప్రకాష్ రావు ఫిర్యాదు పై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన కమిడి హేమంత్ దుర్గాప్రసాద్ @ దుర్గ అనువానిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి రూ.9 వేలు హుండీ సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు గోకవరం ఎస్సై వి ఎన్ వి పవన్ కుమార్ బుధవారం తెలిపారు సదరు హేమంత్ దుర్గా ప్రసాద్ ను రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం 1 వ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారి వద్ద హాజరపరిచినట్టు ఎస్సై తెలిపారు
సాయిబాబా గుడి హుoడీ దొంగతనం కేసులో వ్యక్తి అరెస్ట్
RELATED ARTICLES
