- జీవనశైలి మార్పులే మధుమేహానికి చికిత్స
- చక్కెర వ్యాధి బాధితుల్లో అవగాహన లేదు
- డి సి ఫర్ డయాబెటిక్ లయన్ శేషు కుమార్
భీమవరం ; జయ జయహే
జీవనశైలి మార్పులే మధుమేహానికి చికిత్స అని డి సి ఫర్ డయాబెటిక్ లయన్ ఏ శేషు కుమార్ అన్నారు. భీమవరం డిఎన్నార్ అతిథి గృహం వద్ద శుక్రవారం ప్రపంచ మధుమేహం దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓమిక్స్ ల్యాబ్ వారి సహకారంతో ఉచిత డయాబెటిక్ టెస్ట్ క్యాంప్ నిర్వహించారు. శేషు కుమార్ మాట్లాడుతూ మధుమేహం ఇప్పుడు పెద్దవారికే కాకుండా యువతలో కూడా వేగంగా పెరుగుతోందని, 20 ఏళ్ల లోపు 11 లక్షల మందికి పైగా పిల్లలు, యువకులు టైప్-1 మధుమేహంతో బాధపడుతున్నారని, 15–19 ఏళ్ల వయసులో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం గత మూడు దశాబ్దాలలో రెండింతలు పెరిగిందన్నారు. డిఎన్నార్ కళాశాల అసిస్టెంట్ సెక్రటరీ రుద్రరాజు రామకృష్ణరాజు (బోసు రాజు), కోశాధికారి కొత్త శ్రీను, ఓమిక్స్ ల్యాబ్ ఎండీ కొమ్మల మురళీ కృష్ణ మాట్లాడుతూ అధిక బరువు, కుటుంబ చరిత్ర, రక్తపోటు లేదా వ్యాయామం లేకపోవడం, ఇలాంటివారు క్రమం తప్పకుండా రక్త చక్కెర పరీక్ష చేయించుకోవాలని సూచించారు. రోజువారీ చిన్న మార్పులు ఎంతో అవసరమని అన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రాంబాబు, కార్యదర్శి అల్లు తులసి ప్రసాద్ మాట్లాడుతూ మధుమేహం వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధి అని, ప్రతి ఇద్దరి చక్కెర వ్యాధి బాధితుల్లో ఒకరికి తమ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియడం లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల మందికిపైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు.
అనంతరం ఉచిత డయాబెటిక్ టెస్ట్ లను సుమారు 250 మందికి చేశారు. టెస్ట్ లో 250 ఎం జి/డీలఎల్ అంతకు మించి ఉన్నవారికి ఒమిక్స్ ల్యాబ్ లో ఏచ్ బి ఏ 1సి బ్లడ్ టెస్ట్ లను సుమారు 20 మందికి ఉచితంగా చేశారు. కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి కనగర్ల రామకృష్ణ, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ కటికల పుల్లారావు, ఓమిక్స్ ల్యాబ్
డా పులగం మధు, నందమూరి రాజేష్, కోట్ల నాని, తటవర్తి బదరి, అల్ వాకర్స్ సభ్యులు, మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు, డి ఎన్ ఆర్ సైకిలు క్లబ్ సభ్యులు తదితరులు పాలుగొన్నారు
