Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshజ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ల్యాంప్ సంస్థ డైరెక్టర్ సాల్మన్ పాల్

జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ల్యాంప్ సంస్థ డైరెక్టర్ సాల్మన్ పాల్

పర్యావరణ పరిరక్షణకు మహిళల ఆర్థిక అభివృద్ధికి జూట్ బ్యాగ్, తదితర వస్తువుల శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని ల్యాంప్ సంస్థ డైరెక్టర్ కొండపల్లి సాల్మన్ పాల్ అన్నారు. మండల కేంద్రమైన అమరావతిలో బుధవారం ల్యాంప్ సంస్థ,జన చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు జ్యూట్ బ్యాగ్, జూటుతో తయారుచేసే వివిధ రకాల వస్తువుల రెండు నెలల శిక్షణ కార్యక్రమాన్ని సాల్మన్ పాల్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సాల్మన్ పాల్ మాట్లాడుతూ శిక్షణ పొందిన మహిళలు ఇంటి వద్ద నుండే జ్యూట్ వస్తువులను తయారు చేసుకోవచ్చని ఆవస్తువులను మార్కెటింగ్ చేయటం ద్వారా కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఉండవన్నారు.ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ముప్పు
ఏర్పడుతుందని ప్రతి ఒక్కరూ ఇంటినుండే ప్లాస్టిక్ నిషేధించి జ్యూట్ బ్యాగులను ఉపయోగించుకోవాలని కోరారు.జన చైతన్య సమితి కార్యదర్శి తుళ్లూరి సాంబశివరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఈశిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు.కార్యక్రమంలో ల్యాంప్ సంస్థ ప్రతినిధులు తురకా మంగయ్య,షేక్ బాజీ, గుడ్ షెఫర్డ్ సంస్థ ప్రతినిధి తండు లక్ష్మణ్,జన చైతన్య సమితి ప్రతినిధులు వెలితోటి అనిల్ కుమార్,షేక్ లియాఖత్ ఆలీ, శిక్షకురాలు షేక్ జుబేదా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments