భారత చైతన్య యువజన పార్టీ (బిసివై)లో అత్యంత కీలకమైన, పార్టీ రాజకీయ దిశా నిర్దేశం మరియు వ్యూహాత్మక నిర్ణయాలలో ప్రధాన పాత్ర పోషించే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జయకళ్యాణి ఆకులకు స్థానం కల్పించారు. ఈ నియామకం ద్వారా పార్టీలో మహిళా నాయకత్వానికి మరింత ప్రాధాన్యం లభించడంతో పాటు, పశ్చిమ గోదావరి జిల్లాకు పార్టీ అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం దక్కిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పార్టీ కార్యక్రమాల్లో జయకళ్యాణి ఆకుల చూపిన చురుకైన పాల్గొనడం, ప్రజా సమస్యలపై ఆమెకున్న లోతైన అవగాహన, ముఖ్యంగా మహిళల హక్కులు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం, గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాలపై ఆమె నిరంతర పోరాటాన్ని గుర్తించిన బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఈ కీలక నియామకాన్ని చేపట్టారు. పార్టీ భవిష్యత్ రాజకీయ వ్యూహాలను రూపొందించడంలో ఆమె అనుభవం, అంకితభావం ఉపయోగపడతాయని భావించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జయకళ్యాణి ఆకుల మాట్లాడుతూ, బిసివై పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తనకు అవకాశం కల్పించినందుకు పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకుంటానని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు.పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ కార్యకలాపాలకు కొత్త ఉత్సాహం, వేగం లభిస్తాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బిసివై పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో జయకళ్యాణి ఆకుల నియామకం
RELATED ARTICLES
