శుక్రవారం పరీక్షలకు 38 మంది డుమ్మా
సిట్టింగ్ స్క్వాడ్ పర్యవేక్షణలో పరీక్షలు
మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈనెల 23న ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 19వ తేదీ వరకు జరుగుతాయి. మాడుగుల కళాశాలలో మొత్తం 277 మంది విద్యార్థులు ప్రజలకు హాజరవుతున్నారు. అయితే శుక్రవారం జరిగిన హిస్టరీ బోటనీ ఒకేషనల్ పరీక్షలకు 38 మంది విద్యార్థులు హాజరు కాలేదు. దీంతో 239 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. సిట్టింగ్ స్క్వాడ్ ఎన్ శాంతి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పరీక్షలను సిఎస్ బి సూరిబాబు, డి ఓ లు అప్పలనాయుడు, సిహెచ్ రామకృష్ణ ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతున్నారు.
