Saturday, June 6, 2026
HomePoliticsAndhra Pradeshబంగారమ్మ ఆలయ పునఃనిర్మాణం పేరుతో అక్రమ వసూళ్లు

బంగారమ్మ ఆలయ పునఃనిర్మాణం పేరుతో అక్రమ వసూళ్లు

కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు
విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం లో గ్రీవెన్స్ సందర్భంగా కలెక్టర్ కు కొండయ్యవలస గ్రామ ప్రజల ఆరాధ్య దేవత మరిడిమాంబ, బంగారమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ మరియు గ్రామ పెద్దలు కలిసి ఆలయ కమిటీకి గ్రామ పెద్దలకు ఎటువంటి విషయం చెప్పకుండా ఏకపక్షంగా పట్టా రామ అప్పారావు పామల వసంత కొంతమంది కలిసి బంగారమ్మ ఆలయ పునర్నిర్మాణం చేస్తామని పండగ మార్చి 4వ తేదీన ప్రకటిస్తే ఐదో తేదీన బంగారమ్మ ఆలయ పునర్మాణ శంకుస్థాపన చేస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని . ఆచారం ప్రకారం పండగ చాటిపు తర్వాత ఎటువంటి పనులు చెయ్యి రాదని కమిటీ చెప్పినప్పటికీ వ్యతిరేకిస్తూ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. ఊరు ప్రజలు ఆచారం ప్రకారం మనోభావాలు దెబ్బ తీసే విధంగా దీనిపై అభ్యంతరం తెలుపుతూ వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ను కోరుతూ ఫిర్యాదు చేయడం జరిగినది.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ అధ్యక్షులు బలిరెడ్డి శ్రీనివాసరావు, కార్యదర్శి బుదిరెడ్డి అప్పారావు, గ్రామ పెద్దలు మరిసా రామచంద్రరావు, సాయన సన్యాసిరావు, బలిరెడ్డి సత్యనారాయణ, వడ్డాది శ్రీనివాసరావు, బండారు చందు రమేష్, పలక అచ్యుత్ ,విందుల కళ్యాణ్ పాల్గొని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అక్రమ వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేసారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments