భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎంవీపీ కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి హామీ ఇచ్చారు.
