తొట్టంబేడు మండల ఎంపీడీవో సురేంద్రనాథ్ కి 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఎంపీడీవోగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఉత్తమ ఎంపీడీవోగా ప్రశంసా పత్రం అందుకున్న సందర్భంగా తొట్టంబేడు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మండల అధ్యక్షులు గాలి.మురళి నాయుడు మంగళవారం నాడు దుశ్యాలతో ఘనంగా సన్మానించి అనంతరం సీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాలి.మురళి నాయుడు మాట్లాడుతూ మండలానికి ఎంపీడీవో పి.సురేంద్రనాథ్ కి ఈ అవార్డు 2 వ సారి దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఆయన మండల ప్రజలకు ఏ సమస్య వచ్చినా చరవాణి ద్వారా వెంటనే పరిష్కరిస్తారని అలాంటి వారికి ఇలాంటి పురస్కారాలు రావడం చాలా ఆనందమని తెలియజేశారు.ఇంకా మరెన్నో ఉత్తమ అవార్డులు రావాలని ఆయన శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞాన ప్రసునాంబ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలిపారు.
