డిఆర్ఎం కి ధన్యవాదాలు
రైల్వే ట్రాక్ ఇరు ప్రక్కల వేసిన ఫెన్సింగ్ ని సందర్శించిన కూటమి నాయకులు. ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ అగనంపూడి పునరావాసి కాలనీ గ్రామాలో నిర్వాసితులు చాలామంది గేదెలు , ఆవులు నుండి పాలు తీసి వాటిని అమ్ముకొని జనజీవనం చేస్తున్నారు, నేడు వాటి ఖరీదు 50 వేల నుండి లక్ష రూపాయలు వరకు ఉన్నది, పశువులు మేత కొరకు రైల్వే ట్రాక్ అవతలకి తీసుకొని వెళ్తుంటారు ఆ సమయంలో ఇటీవల చాలా పశువులు ట్రైన్ యాక్సిడెంట్ లో మరణించడం జరిగినది దానితో నిర్వాసితులు చాలామంది బాధపడుతున్న తరుణంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే డి ఆర్ ఎం కీ పశువులు ప్రమాద నివారణకు రైల్ ట్రాక్ ఇరుపక్కల ఫెన్సింగ్ వెయ్యమని వినతిపత్రం ఇవ్వగా వారు స్పందించి ఫెన్సింగ్ వేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. టిడిపి నాయకులు శీరంశెట్టి బాబ్జి, జనసేన పార్టీ నాయకులు బలిరెడ్డి సోమినాయుడు పాల్గొన్నారు.
వినతి తో రైల్వే ట్రాక్ కు ఫెన్సింగ్
RELATED ARTICLES
