రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు దివ్యాంగ శక్తి పథకం ఈరోజు నుంచి అమలు జరుగుతున్న సందర్భంగా టెక్కలి కూటమి నాయకుల సారథ్యంలో దివ్యాంగ సోదర సోదరీమణులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ఆధ్వర్యంలో టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ లో దివ్యాంగుల బస్సును తెదేపా నాయకులు కార్యకర్తలు బస్సును ప్రారంభించారు. దివ్యాంగ సోదరుల తో పాటు ప్రయాణించిన సహాయకులకు 50% బస్సు చార్జీలు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు, ప్రతి దివ్యాంగ సోదరులు ఈ దివ్యాంగ శక్తి పథకం ను సద్వినియోగం చేసుకోవాలని కూటమి ప్రజాప్రతినిధులు తెలిపారు.
