శ్రీకాకుళం జిల్లా జయ జయహే కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసిలాట ఘటనలో భక్తులు దుర్మరణం చెందడం పట్ల వారికి సానుభూతి వ్యక్తం చేస్తూ, వారి ఆత్మకు సంపూర్ణ శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మ గాంధీ విగ్రహం వద్ద నుండి ఆర్ టి సి కాంప్లెక్స్ సర్కిల్ వరకు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కె.కె రాజు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి ,మొల్లి అప్పారావు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ,డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు పేర్ల విజయ చంద్ర, ద్రోణంరాజు శ్రీవత్సవ్,కార్పొరేటర్లు పి.వి సురేష్,సాడి పద్మారెడ్డి,ఉమ్మడి స్వాతి,రెయ్యి వెంకటరమణ,అనిల్ కుమార్ రాజు,వావిలపల్లి ప్రసాద్,బర్కత్ అలి,పళ్ళ దుర్గా,బిపిన్ జైన్,రాష్ట్ర నాయకులు తుళ్ళిచంద్రశేఖర్,రాజబాబు,రాధ,ఈశ్వరి,అనుబంధ విభాగ అధ్యక్షులు పెడాడ రమణి కుమారి, కోడూరి సుశీల,సునీల్ కుమార్,రవీంద్ర భరత్,జీలకర్ర నాగేంద్ర,ప్రేమ్ కుమార్, బొండా ఉమామహేశ్వర రావు,సకలబత్తుల ప్రసాద్, బోని శివరామ కృష్ణ,వంకాయల మారుతి ప్రసాద్,రాయపురెడ్డి అనిల్,కర్రి రామారెడ్డి,మాజీ కార్పొరేటర్లు,వార్డు అధ్యక్షులు,పార్టీ ముఖ్య నాయకులు,నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
