కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భీష్మఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ అధిక మవడంతోబుధవారం నాడు రాత్రి 8 గంటల నుండి అధిక సంఖ్యలో చేరుకోవడంతో రత్నగిరిపై పలు ప్రాంగణాల్లో ఆరుబయటే విశ్రమించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రత్నగిరి పై వసతి సముదాయం తక్కువ సంఖ్యలో ఉండడంవలన భక్తులు స్వామివారి వార్షిక కళ్యాణ మండపంలోఅధికసంఖ్యలో విశ్రమించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి రద్దీనీ అధికారులు గమనించి రాత్రి 10 గంటల నుండి టికెట్లువిక్రయించి 12 గంటల నుండి వ్రతాలు ప్రారంభించి స్వామివారి సర్వదర్శనాలు2. గంటల నుండి మొదలుపెట్టారు
