చోడవరం నియోజకవర్గం, రోలుగుంట మండలం బుచ్చెంపేట గ్రామంలో వెలమజాతి ముద్దుబిడ్డ స్వర్గీయ తాండ్రపాపరాయుడు విగ్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంటు సభ్యులు మరియు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సి ఎం రమేష్, చోడవరం నియోజకవర్గం శాసన సభ్యులు కె ఎస్ ఎన్ రాజు, మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యులు బండారు సత్యనారాయణ, ఉత్తరాంధ్ర ఉపాధ్య శాసనమండలి సభ్యులు గాది శ్రీనివాసుల నాయుడు పాల్గొని విగ్రహావిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కె సురేంద్రమోహన్, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ఈర్లె శ్రీరామ్మూర్తి, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకటరావు, చల్ల సత్యనారాయణ, యర్రా వెంకటరావు, గొర్లె అర్జున, రాయవరపు సత్తిబాబు, చొక్కాకుల రామకృష్ణ మరియు గ్రామప్రజలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
