స్థానిక బిజెపి నాయకులు మంగళవారం సివిల్ సప్లై ఆఫీసును సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరావు, గంగుపాం నాగేశ్వరావు, తమరాన దాలినాయుడు సివిల్ సప్లై అధికారి వై మాలకొండయ్యను కలిసి అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ సంబంధించిన రేషన్ సరుకులు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా, మిగిలి ఉన్న సరుకులు ఏమవుతున్నాయి వంటి వివరాలను సివిల్ సప్లై అధికారులును అడగడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరడం జరిగింది
