Home Politics Andhra Pradesh కొవ్వూరులో చురుగ్గా జనసేన సభ్యత్వ నమోదు

కొవ్వూరులో చురుగ్గా జనసేన సభ్యత్వ నమోదు

0

పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. జనసేన పట్టణ మహిళా అధ్యక్షురాలు కడదారి నవ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ఉద్యమి సభ్యత్వాలను విస్తృతంగా నమోదు చేశారు.
ఈ సందర్భంగా కడదారి నవ్య మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకలాపాల్లో భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
ఇందిరమ్మ కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు పార్టీ లక్ష్యాలు, కార్యక్రమాల గురించి వివరించి సభ్యత్వ నమోదు చేపట్టారు. స్థానిక ప్రజలు కూడా కార్యక్రమానికి మంచి స్పందన చూపినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు, వార్డ్ ఇంచార్జ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version