శివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాలో జాతీయ రహదారి పక్కన శివలింగ ఆకారంలో నిర్మాణం చేపట్టిన శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ఆగనంపూడి పునరావాస కాలనీ పరిసర గ్రామాల భక్తులు కుటుంబ సమేతంగా సముద్ర స్నానాలు చేసి భక్తులు శ్రీ ఉమమేశ్వర ఆలయ ప్రాంగణములో పదివేల మంది మహా అన్న సమారాధనలో పాల్గొన్నారు. శ్రీ ఉమా మహేశ్వర ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యంగా ఏర్పాటుచేసిన భోజనాలు అగనంపూడి శ్రీ సత్యసాయి భజన మండలి సేవాదళ్ మహిళలు , పురుషులు అన్న సమారాధనలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదాలు చేసారు . ఈ కార్యక్రమంలో 85వ వార్డు కార్పొరేటర్ ఇల్లపు ప్రసాద్, ఏ డి సి చైర్మన్ బలరెడ్డి సత్యనారాయణ, నెల్లి శ్రీను,మజ్జి శ్రీను, దానబొయన అప్పలనాయుడు,విందుల చిరురాజు,కరణం సన్నీ,గెద్దాడ అప్పలరాజు, అమరపిన్ని సోమేష్,మాడుగుల నూకరాజు, గోకాడ లోవరాజు నాగేష్ మాడుగుల బుజ్జి, గుదే అప్పలరాజు, కొలిపాక అప్పారావు, దొడ్డి దేవుడు, శ్రీ సత్య సాయి భజన మండలి ప్రతినిధులు బీవీ సుబ్బారావు విందుల పైడ్రాజు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీ ఉమామహేశ్వర ఆలయం వద్దభారీ అన్న సమారాధన
RELATED ARTICLES
