భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన ముగిసింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు మంగళవారం వచ్చిన ఆమె బుధవారం ఆ కార్యక్రమం అనంతరం నేవెల్ ఎయిర్ స్టేషన్ నుంచి బయలుదేరారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్, జిల్లా ఇంచార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, సీపీ శంఖ బ్రత బాగ్చి తదితరులు రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.
