– ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అవసరం
………….ఆకుల చలపతి రావు,
జీవం ఉన్న పంటలతో సబల భోజనాల పండుగ నిర్వహిస్తున్నామని ఎపి నర్సరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆకుల చలపతి రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం సింహాచలం దేవస్థానానికి చెందిన గోశాల లో “సబల భోజనాల పండుగ” కోసం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరాం నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగుతోంది అన్నారు. ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం అవసరం అన్నారు. ప్రధానంగా ప్రకృతి పంటలే ఆరోగ్యకరం, ఆనంద దాయకం అని వివరించారు. అలాంటి జీవం ఉన్న పంటలతో మన పూర్వీకులు వంటలు ఎలా చేసుకున్నారో అలాంటి రుచి కరమైన, సుచికరమైన, ఆరోగ్యకరమైన వంటలు వండటం, భుజించడం, అవగాహన కలిగించడం కోసం ఏప్రిల్ 1 నుంచి 5 వ తేదీ వరకూ సభలో భోజనాలు పండుగ నిర్వహించడం జరిగుతోంది అన్నారు.
ఈ కార్యక్రమంలో తులసి నేచురల్స్ సత్యనారాయణ మాట్లాడుతూ సబల భోజనాలు పండుగలలో ఉత్తరాంధ్ర సాంస్కృతిక కళల ప్రదర్శన నిర్వహించడం జరిగుతోంది అన్నారు. అలాగే పాత ఇత్తడి, మట్టి పాత్రలలో వంటడం జరుగుతుంది అని వివరించారు. జన్యుమార్పిడి పంటలు వద్దే వద్దు అన్నారు. మనం మన సాంస్కృతిని, కళలను కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ప్రంట్ అధ్యక్షులు ఎం ఆర్ ఎన్ వర్మ మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టు ఈ సబల భోజనాలు పండుగలలో పాల్గొనాలని, జయప్రదం చేయాలని, విస్తారంగా ప్రచారం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, ప్రకృతి రైతు గుంటూరు జగన్నాద రాజు, మేంగొ మేన్ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.
జీవం ఉన్న పంటలతో సబల భోజనాల పండుగ
RELATED ARTICLES
