మనమ్ సేవా సొసైటీ తరఫున తగరపువలస అంబేద్కర్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని మహేశ్వరి కి ఆర్థిక సహాయం అందచేసారు మహేశ్వరీ తండ్రి రోడ్లపై స్క్రాప్ సేకరించే పని చేయడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది . మహేశ్వరి చదువులో టాపర్గా నిలుస్తూ క్రీడల్లో కూడా మంచి ప్రతిభ చూపుతోంది. ఆమె విద్యను ప్రోత్సహించేందుకు స్కూల్ యూనిఫాం స్టిచింగ్ ఛార్జీలు మరియు 3 నెలల ట్యూషన్ ఫీజు కోసం మొత్తం రూ.3000 ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా మనమ్ సేవా సొసైటీ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ, ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న ఆర్థికంగా బలహీనమైన కుటుంబాల విద్యార్థులు బాగా చదివి 10వ తరగతిలో మంచి మార్కులు సాధిస్తే, వారిలో టాప్ 3 మంది విద్యార్థులను ఎంపిక చేసి మనమ్ సేవా సొసైటీ ద్వారా ఉచితంగా ఇంటర్మీడియట్ చదివేలా ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ పాఠశాల ఇన్చార్జ్ హెడ్మాస్టర్ ఎస్. జగదీష్ తెలుగు ఉపాధ్యాయులు అప్పలరాజు , మనమ్ సేవా సొసైటీ కార్యకలాపాలను ప్రశంసిస్తూ సొసైటీ వ్యవస్థాపకుడికి కృతజ్ఞతలు తెలిపారు.
