ఒమ్మలి గ్రామ సభలో ఉల్లావ రెవిన్యూని ఈ ఏడాది జనవరిలో వెబ్ ల్యాండ్ లో నమోదు చేసి పట్టాలిస్తామని మాడుగుల చోడవరం ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారనీ ఆ హామీ అమలు చేయాలని కోరుతూ గురువారం కోమీరి గ్రామంలో పేకార్డ్ లతో గిరిజనులు నిరసన తెలిపారు.అనకాపల్లి జిల్లా రావికతం మండలం కొమెరి, మచ్చిపురం,బుడ్డి బంద, కవ్వుకుంట గిరిజనులు దళితులు ఇతర పేదలు350 మంది ఊర్లోవ రెవిన్యూ పరిధిలో డి- పట్టా కలిగి ఉన్నారు. ఈ రెవెన్యూ వి.మడుగుల మండలం పరిధిలో ఉంది. 2012-13 సంవత్సరంలో పట్టాలిచ్చారు. రెవిన్యూ వెబ్లాన్ రికార్డులు లోఊరలోవ రెవిన్యూ అనేది లేదు. వెబ్లాండి రెవెన్యూ రికార్డులో నమోదు చేయాలని కోరుతూ భూమి సిస్తులు కమిషనర్ విజయవాడ వారికి సిపిఎం ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేశారు. కమిషనర్ ఆదేశం మేరకు జిల్లా కలెక్టర్, ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నెల రోజుల్లో రికార్డు తయారు చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు . దీనికి స్పందించిన తహసిల్దార్ ఇతర అధికారులు గత ఏడాది సెప్టెంబర్ లో వి జగన్నాధపురం లో చోడవరo, మాడుగుల ఎమ్మెల్యేలు సత్యనారాయణమూర్తి. కే ఎస్ ఎన్ రాజు స్థానిక ఎమ్మార్వో ప్రజాప్రతినిధులు గ్రామసభ నిర్వహించి
జనవరి నెలలో ఊరలోవ రెవిన్యూ వెబ్ ల్యాండ్ రికార్డులో నమోదు చేసి రికార్డులు నమోదు చేసి పట్టాలిస్తామని సభలో ప్రకటించారు. నేటికీ పట్టాలు ఇవ్వలేదన్నారు
