స్థానిక బుచ్చయ్య పేటలో మంగళవారం ఆంజనేయ స్వామి తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సర్వ సుందరంగా తీర్చిదిద్ది స్వామివారికి ప్రత్యేక అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం భారీగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్ల పరుగులు పందాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. రాత్రికి సంస్కృతిక కార్యక్రమాలు భారీగా మందు గుండు సామాగ్రి ఏర్పాటు చేశారు గ్రామంలో పండగ వాతావరణం లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.
