ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 పథకంలో భాగంగా సోమవారం మాడుగుల మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, బిజెపి సీనియర్ నాయకులు పుట్ట గంగయ్య తదితరులు గ్యాస్ కనెక్షన్స్ పంపిణీ చేశారు. మాడుగుల మండలంలో మొత్తం 700 భారత్ గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయగా, చిడికాడ మండలానికి సంబంధించి 50 ఇండియన్ గ్యాస్ కనెక్షన్ లో పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అందిస్తున్న గ్యాస్ కనెక్షన్లు సద్విని పరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అప్పలరాజు, కూటమి నాయకులు జగ్గారావు విజయలక్ష్మి, మెల్లిపాక స్వామి,పుట్టా రాంబాబు, దేవుడు రమేష్ లక్ష్మీనారాయణ, మాడుగుల చీడికాడ తహసిల్దార్లు రమాదేవి కిషోర్ లింకన్ తదితరులు పాల్గొన్నారు.
