Sunday, April 19, 2026
HomePoliticsAndhra Pradeshత్రిమూర్తి శివ జయంతి మహోత్సవంలో పాల్గొన్న విఎంఆర్డిఏ చైర్మన్

త్రిమూర్తి శివ జయంతి మహోత్సవంలో పాల్గొన్న విఎంఆర్డిఏ చైర్మన్

మహా శివరాత్రి సందర్భంగా ప్రజా పిత బ్రహ్మ కుమారీస్ అధ్వర్యంలో ఎండాడలో నిర్వహించిన త్రిమూర్తి శివ జయంతి మహోత్సవం లో అభిషేక లింగ దర్శనం, సహస్ర లింగ దివ్య దర్శనం కార్యక్రమంలో వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ పాల్గొని పూజలు జరిపారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయ కారకుడు శివుడికి ఎంతో ప్రీతికరమైన శివరాత్రి రోజున శివ ధ్యానంలో గడపాలని పేర్కొన్నారు. శివారాధనలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు. ఈ సందర్భంగా ఎం వి ప్రణవ్ గోపాల్ ని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అలానే పలువురు కళాకారులను ఎం వి ప్రణవ్ గోపాల్ చేతుల మీదుగా సత్కరించారు. అనంతరం నగరం లో పలు శివాలయాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శివ. ఆలయ ప్రతినిధులు చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ ని ఘనంగా సత్కరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments