ఎమ్మెల్యేకు ప్రైవేట్ యజమాన్యాలు వినతి ,తమకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చోడవరం నియోజకవర్గంలో గల డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజుకు విజ్ఞప్తి చేశారు. గ సోమవారం వారంతా కలిసి ఎమ్మెల్యేకు ఫీజు రీయంబర్స్ మెంటు(ఆర్ టి ఎఫ్ ) పై వినతిపత్రం అందజేశారు. బకాయిలు పేరుకుపోవడం వల్ల తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే
ఫీజు రియంబర్స్మెంట్(ఆర్ టి ఎఫ్ ) బకాయిలు విషయం విద్యాశాఖమంత్రి లోకేష్ దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం
లో ఉషోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ ఎన్ నాయుడు, వైస్ ప్రిన్సిపల్ పి దొరబాబు, ఎస్ ఎస్ పి డిగ్రీ కళాశాల చైర్మన్ బంగారు నాయుడు,ఇంచార్జ్ నాయుడు, విద్యార్థి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వి అర్జున్ రావు,ఏ ఓ సిహెచ్ దేవుడి నాయుడు, పూసర్ల సంతోష్ కుమార్, ఫోర్ ఎస్ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ అచ్చం నాయుడు, గాయత్రి డిగ్రీ కళాశాల చైర్మన్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించండి
RELATED ARTICLES
