జగన్ కు పెళ్లి కార్డు అందచేత ,వివాహానికి తప్పకుండా హాజరవుతానని జగన్ హామీ దక్షిణ
నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుటుంబ సభ్యులు గురువారం తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
తమ రెండవ కుమారుడు గోవింద సాకేత్ వివాహానికి తప్పకుండా హాజరు కావాలంటూ పెళ్లి కార్డును ఆయనకు అందజేశారు.
తప్పకుండా ఈ వివాహానికి తాను హాజరవుతానని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు.
వాసుపల్లి గణేష్ కుమార్, ఉషారాణి దంపతులు, పెద్ద కుమారుడు సూర్య ఆయన సతీమణి రాశి అలాగే రెండవ కుమారుడు గోవింద సాకేత్ పాల్గొని జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన వాసుపల్లి కుటుంబ సభ్యులు
RELATED ARTICLES
