అక్రమార్కుల చేతుల్లో సర్కార్ ఆస్తులు ఆవిరి ప్రభుత్వ శాఖల అలసత్వానికి నిజ సాక్షాలు దశాబ్దాల కాలంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో వర్షాధారంగా నిశ్శబ్ద వాతావరణం లో తాగు, సాగునీటినీ ప్రజలందరికీ అవసరాలని తీరుస్తున్న మన ప్రాంతాల్లోన ప్రభుత్వ స్థిరాస్తులైన చలనం లేని ఈ చెరువులు దురాక్రమణదారుల ఆస్తులుగా వారి హస్తాల్లో ఆక్రమించబడిన చెరువులు జిల్లాలో కోకోలలుగా ఉన్నాయి సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల నిర్లక్ష్యం నీడలో ఈ చెరువులు గురవుతున్నాయి.జిల్లాలో పలు చెరువులు ఎండిపోయి ఎడారులుగా దర్శనం ఇ వ్వగా మరికొన్ని మట్టి దెబ్బలుగా మారిపోతున్నాయి ఒక నాడు పల్లె , పట్టణ వాసులకు సాగు, తాగునీరు, అందించిన ఈ చెరువులో భారీగా కబ్జాలకు గురవుతున్నాయి.
జిల్లాలో మైనర్ ఇరిగేషన్ శాఖ పరిధిలో సుమారు 6 422 ఉన్నట్టు అంచనా జనజీవనానికి , జీవరాసులకు పనికొచ్చే పలు చెరువులు ఎండిపోయి క్రీడా మైదానాలుగా తయారు కావడం ఆందోళన కలిగిస్తుంది. కేవలం 150 చెరువులను ఆధునీకరణ కు సంబంధిత శాఖ ప్రణాళిక సిద్ధం చేయగా మిగతా చెరువులు ఆదరణకు గురికావడం లేదనేది గ్రామీణ వాదన, బురద పూడిక నిండిపోయిన చెరువులను తక్షణమే ప్రత్యేకమైన చట్టపరమైన చర్యలు తీసుకొని కబ్జాదారుల చేతుల నుంచి ప్రజా జీవనానికి పనికి వచ్చేలా చెరువులను జిల్లాలో ఉన్న జీవనదులు వంశధార, నాగావళి, ప్రకృతి జలదారులతో అనుసంధానం చేస్తే జిల్లా ప్రజలకు ప్రకృతి జీవరాశుల మొనబడకు అభివృద్ధికి ఎలాంటి నీటి వనరులకు ఇబ్బందులు ఉండవని పలువురు మేధావి వర్గా లు ప్రజలు భావిస్తున్నారు .
