చోడవరం దేవాదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి ఎస్ వి బి సత్యనారాయణమూర్తికి విశిష్ట అవార్డు లభించింది. భారత77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం అనకాపల్లిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ చేతుల మీదుగా విశిష్ట అవార్డును అందుకున్నట్టు ఈవో తెలిపారు.శ్రీ స్వామివారి సేవలో తనకు సహకరిస్తున్న వారికి, జిల్లా కలెక్టర్కు, దేవాదాయ శాఖ ఉన్నత అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
