అభయం యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలలో శనివారం శ్రీ విశ్వజ్యోతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పినకాన జోగారావు సౌజన్యంతో 15 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారని అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాస రావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చిన విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ.. జ్ఞాపిక తో సత్కరించి పోషకాహార కిట్ అందజేశారు. ఈ కార్యక్రమం లో అభయం సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాస రావు, సంఘ సభ్యులు అద్దాల వీరభద్రాచారి, కళాశాల అధ్యాపకులు లక్ష్మణరావు, హరికృష్ణ, మధు,మల్లేశ్వరరావు, పాల్గొన్నారు.
అభయం రక్తదాన శిబిరంలో విశ్వజ్యోతి విద్యార్థులు రక్తదానం
RELATED ARTICLES
