మాడుగుల బస్టాండ్ ఆవరణలో వేంచేసియున్న శ్రీ దుర్గాదేవి అమ్మవారికి గ్రామానికి చెందిన దాత ఆలయ కమిటీ కార్యదర్శి దంపతులు 30000 రూపాయలు విలువచేసే పంచలోహ కిరీటాన్ని అందజేశారు. ఈ కిరీటాన్ని అమ్మవారికి తొడిగినట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. దీంతో ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రసాదను అభినందించారు.
