మహిళా శక్తి తోనే సమాజ అభ్యున్నతి సాధ్యమవుతుందని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జెసిఐ) వైజాగ్ పారామౌంట్ ప్రెసిడెంట్ కొండా పృధ్వీరాజ్ పేర్కొన్నారు. సోమవారం జె.సి.ఐ. వైజాగ్ పారమౌంటు ఆధ్వర్యం మహిళా దినోత్సవ వేడుకలు శంకరమఠం రోడ్ లో ఉన్న వీ డెంటల్ హాస్పిటల్ లో ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న జె.సి.ఐ. మహిళలు బి. కవిత, ఇందల భవాని, బి.ధాత్రిల ను
ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జోన్ వైస్ ప్రెసిడెంట్ బచ్చు చైతన్య రాజీవ్. జెసిఐ ప్రతినిధులు కె .శ్రీధర్, బి. కమల్, జస్వంత్, నితీష్, డి.వి.ఆర్. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
