బుచ్చయ్యపేట మండలం తురకలపూడిలో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే తోకలి రాము ఇంట్లో రెండు తులాల బంగారం తోడు, మూడు జతల వెండి పట్టీలు ఒక వెండి భరణి అపహరణకు గురయ్యాయి సుమారు 5 లక్షలు విలువ గల వస్తువులు పోవడంతో బాధపడుతున్నాడు. బాధితుడు రాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా స్థానిక ఎస్సై శ్రీనివాసరావు క్లూ టీమ్ తో వచ్చి వివరాలు, వేలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని యస్ ఐ శ్రీనివాసరావు తెలిపారు
