కొయ్యూరులో “పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే” ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని కొయ్యూరు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు అన్నారు. సోమవారం పీఎం జన్మన్ పథకం ద్వారా మంజూరై, పూర్తయిన ఇళ్లను స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ ఉమామహేశ్వరరావు, వర్క్ ఇన్స్పెక్టర్ గోవిందరావు, పంచాయతీ అభివృద్ధి అధికారి పీ.రాంబాబు పాల్గొన్నారు.
