చోడవరం మండలంలో శనివారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు అన్ని గ్రామ పంచాయతీలలో నిర్వహించారు. దానిలో భాగంగా చోడవరం మెయిన్ రోడ్డు మధ్యగా ఉన్న డివైడర్ వద్ద పేరుకున్న సిల్క్ తొలగించే కార్యక్రమంలో ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు పాల్గొన్నారు. ప్రతి శనివారం అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రతిరోజు ఈ కార్యక్రమాలు మరింత ముమ్మరం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మండలంలో గల కార్యక్రమాలను ఎండిఓ పరిశీలించారు.
