మాడుగుల మండలం సురవరం వద్ద గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మంగళవారం నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్, అగ్రికల్చర్ జెడి ఏం ఆశా దేవి ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ తనిఖీలో భాగంగా విద్యార్థునీలకు అందజేసే కూరగాయలు ఆకుకూరలు పరిశుభ్రమైనవి ఇవ్వాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. అలాగే వంటగదిని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం విద్యార్థినిలతో మాట్లాడారు. విద్యా విధానం విషయాలు బోధన వంటి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని చెప్పారు.
