చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల లో సోమవారం మండల స్థాయి “స్పెల్ బి” పోటీలు నిర్వహించారు. 6 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు తరగతుల వారీగా మండల విద్యాశాఖాధికారులు పాండురంగారావు, సింహాచలం, ప్రధానోపాధ్యాయులు రామిరెడ్డి ఆధ్వర్యంలో ఆంగ్ల బాషోపాద్యాయులు ఈ పోటీలు నిర్వహించారు. ఈపోటీలలో గెలుపొందిన విద్యార్థులను తరగతికి ఒక్కరిని జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంగ్ల భాషపై మక్కువ చూపాలని, మౌఖిక, వ్రాత పూర్వక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆంగ్ల భాష ప్రాముఖ్యత ను వివరించారు.ఈపోటీలలో 6వ తరగతి వి.జోస్యశ్రీ,,బాలికోన్నత పాఠశాల , చోడవరం,7వ తరగతి బి.లక్ష్మి ప్రసన్న ,లక్ష్మిపురం ఉన్నత పాఠశాల ,8వ తరగతి సి.హెచ్.చందు, దుడ్డు పాలెం ఉన్నత పాఠశాల,9వ తరగతి ఆర్.లేఖన,బాలికోన్నత పాఠశాల,చోడవరం, 10వ తరగతి ఆర్.జ్యోత్స్న ,జ్యోతీ రావు పూలే,చోడవరం గెలుపొందారు.ఈకార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయులు సి.ఆర్.యమ్.టి లు పాల్గొన్నారు.
