విశాఖ ఎంపీ శ్రీ భరత్ పేరును నారా లోకేష్ రెడ్ బుక్ లో తక్షణమే నమోదు చేసి ప్రభుత్వ భూములు కాపాడాలి విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు పెడాడ రమణి కోరారు
ఎంపీ శ్రీ భరత్ గీతం కాలేజీ పేరిట ప్రభుత్వ భూములు 54 ఎకరాలు భూ కబ్జాను కూటమి ప్రభుత్వం ప్రోత్సహించడం సిగ్గుచేటు , చట్ట విరుద్ధంగా జి. ఓ ఇవ్వడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని , భూ కబ్జా దారులందరినీ చట్టం ముందు నిలబెట్టే శిక్ష పడే వరకు పోరాటం చేస్తాం. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , రెడ్ బుక్ లోకేష్ ఇప్పటికైనా మొద్దు నిద్ర వదిలి , ప్రభుత్వ భూములు రక్షించాలని , లేనియెడల
ప్రజా కోర్ట్ లో ప్రజా తీర్పుతో శిక్షింపబడతారని
విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు పెడాడ రమణి హెచ్చరించారు.
