ఆటోనగర్ ఒక ప్రైవేటు స్కూల్ లో వెడాకాయ్ కరాటే డు అసోసియేషన్ విశాఖ అధ్యక్షుడు రాము మాస్టర్ ఆధ్వర్యంలో కరాటే గ్రేడ్ టెస్ట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ మరియు గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు పాల్గొన్నారు. గ్రేడ్ టెస్టులో గెలుపొందిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు బెల్టులు పంపిణీ చేసి అభినందించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ కరాటే శిక్షణ ద్వారా విద్యార్థులకు ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మరక్షణకు దోహదపడుతుందని అన్నారు. ప్రతి రోజు ఒక గంట కరాటే నేర్చుకోవడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చు అని అన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉన్నత చదువులు, ఉద్యోగాలు వస్తాయని మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ కోచ్లు కిషోర్,గోవర్ధన్, అగస్త్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.
