అల్లూరి జిల్లా అరకువేలి మండలం మాడగడ పంచాయతీ సర్పంచ్ మండియా కేడి బాలరాజు పై స్థానిక పంచాయితీ సెక్రటరీ బుడిద పోయిన భోగిరాజు పద్మం పురం లో తమ నివాసం లో బాలరాజు కు పిలిచి మరి తమ ఇంటి కిటికీ అద్దం పగలగొట్టి అత్యాయత్నం కి పాల్పడ్డాడని. అనంతరం పంచాయతీ పరిధిలోని పక్కన గూడ. గంగ గుడి. కాగువలస గ్రామాలలో కొలై మంచినీటి పనులు కాంట్రాక్ట్ గా ఒప్పుకొని చేయగా బిల్లు చెయ్యమని చాలా రోజుల నుండి అడుగగా తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారంటూ ఆయన పేర్కొన్నారు. మార్చి 5వ తేదీన రాత్రి సుమారు 9 గంటల సమయానికి ఈ సంఘటన జరిగిందన్నారు. బాలరాజు సెక్రటరీ భోగి రాజు కు ఫోన్ చేయగా ఇంటికి రమ్మని చెప్పారని సెక్రటరీ ఇంటి వరండాల్ గుమ్మం దగ్గర నిలబడి ఆయన సెక్రటరీకి పిలవడం జరిగింది. అయితే సెక్రటరీ రమ్మని చెప్పి మరి కులం పేరుతో దురుసుగా ప్రవర్తిస్తూ అద్దం చెక్కతో తనపై దాడి చేశారని. బాలరాజు వికలాంగుడు కావడంతో తనపై గాయం అవడంతో కేకలు వేయగా సమీపంలో ఉన్న తన మిత్రుడు మణికంఠకు ఆయనకు అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలరాజుపై అత్యాయత్నం చేసిన సెక్రటరీ భోగిరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
