Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshనిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు

నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు

రాజమండ్రి నగరంలోని టీటీడీ రోడ్డులో మంగళవారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ప్రకాష్ నగర్ సీఐ బాజీరావ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టగా, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, నేరాల నివారణ, రోడ్డు భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు తదితర వాహనాలను ఆపి వాటి రికార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా పత్రాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులను గుర్తించి వారికి జరిమానాలు విధించారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారు, సీట్‌బెల్ట్ ధరించని కార్ డ్రైవర్లు, పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా సీఐ బాజీరావ్ మాట్లాడుతూ, నగరంలో ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments