జనవరి 25న జాతీయ “ఓటర్ల దినోత్సవం” పురస్కరించుకొని రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, విద్యార్థులలో ఓటు హక్కుపై అవగాహన పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఓటర్ల దినోత్సవం అంశంపై మండల స్థాయి వ్యాసరచన, వకృత్వపు పోటీలు నిర్వహించారు. అలాగే వోటర్స్ డే పురస్కరించుకొని విద్యార్థులతో ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు .
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి.వి.శేషగిరి , ఎం.ఈ.ఓ–1, ఎం.ఈ.ఓ–2, ఆంగ్ల ఉపాధ్యాయిని
పి.వి. ఎం.నాగజ్యోతి, బి.ఎల్.ఓలు పాల్గొన్నారు.
రోలుగుంటలో జాతీయ ఓటర్ల దినోత్సవం
RELATED ARTICLES
