గాజువాక 71వ వార్డు శ్రీరాం నగర్ లో వున్న ఆలయంలో శ్రీ రాజశ్యామల యాగం పూజలో పాల్గొన్న బిజేపి జిల్లా మాజీ అధ్యక్షులు రవీంద్ర మేడపాటి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గంలో శ్రీశ్రీ రాజశ్యామలాదేవి అమ్మవారి ఆలయం అతి పురాతనమైన ఆలయం అని అన్నారు. బ్రహ్మ నాయుడు దంపతులు ఆద్వర్యంలో మొదటి సంవత్సరం నవరాత్రులు వైభవంగా జరిగుతున్నాయని అన్నారు. జనవరి నెల ఇరవై ఎనిమిది వరకు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో బిజేపి జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణంరాజు మండల అధ్యక్షురాలు పావని టిడిపి వార్డు అధ్యక్షులు పప్పు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
