గాజువాక డ్రైవర్స్ కోలనీ రోడ్డులో సువిద హాస్పిటల్ ప్రారోంభత్సవ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర పేన లిస్ట్, గాజువాక ఇంచార్జి కరణంరెడ్డి నరసింగరావు ముఖ్య అతిధిగా పాల్గొని సువిధ హాస్పిటల్ ఐసీయూ వార్డును ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ వై.స్రవంతి సొంతంగా హాస్పిటల్ ప్రారంభించి మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందించడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, దినదినాభివృద్ధి చెందుతూ, ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ రాజ్ కుమార్, హాస్పిటల్ సిబ్బంది కూటమి నాయకులు శంకరరావు తదితరులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
