వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల పర్యటన ఖరారు అయింది. బుదవారం ఉదయం 11.30 గంటలకు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు చేరుకుని (రాధాక్రిష్ణ ఆలయం, తంగుల్గూడా గ్రామం, అరకు వ్యాలీ) ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుకుని రాణాప్రతాప్ నగర్లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి వెళతారు. ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం అక్కడి నుంచి తిరుగు విశాఖ విమానాశ్రయం నుండి తాడేపల్లి కు చేరుకుంటారు.
