దేవాలయాలు వద్ద తరచుగా హుండీలు చోరీ జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా దేవాలయాలు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసు వారి విజ్ఞప్తి చేస్తున్నారు.
రావికమతం పోలీస్
వారు గురువారం గుడ్డిప తట్టబండ,తోటకూరపాలెం, గొంప తదితర గ్రామాల్లో సందర్శించి గ్రామ పెద్దలు, గ్రామాల్లో ఆలయ పర్యవేక్షకులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అలాగే సిసి కెమెరాలతో పాటు వారానికి ఒకసారి హుండీలో వేసిన నగదు తీసి బ్యాంకులో నిలువ చేసుకోవాలని సూచించారు.అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. గ్రామాల్లో అలాంటివారు సంచరిస్తే తమకు సమాచారం అందించాలన్నారు.
