గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయాలి
గ్యాస్ రేటు తగ్గించి గ్యాస్ ఆఫ్ చేయాలని కోరుతూ శుక్రవారం రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కళ్యాణ్ లోవ గిరిజనులు కోరుతున్నారు. ఈ మేరకు ఖాళీ గ్యాస్ బండలు వద్ద కంచాలు కొట్టి గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయాలనీ వినూత్నంగా కార్యక్రమం నిర్వహించారు. యుద్ధం కారణంగా వివిధ నిత్యవసర వస్తువులు గ్యాస్ కోసం రావికమతం వెళ్లి అనేకసార్ తిరిగి వస్తున్నాం. ఫోన్ ద్వారా గ్యాస్ బుక్ చేస్తే బుక్ అవడం లేదన్నారు. తక్షణమే తమ గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
